నవ్యాంధ్రకు భారీ కాగిత పరిశ్రమ... రూ. 24,500 కోట్ల పెట్టుబడి!
- ప్రకాశం జిల్లాకు రానున్న ఏపీపీ
- రామయ్యపట్నం వద్ద భారీ కాగితపు పరిశ్రమ
- 15 వేల మందికి ఉపాధి
ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్ సీఈఓ జే కృష్ణ కిశోర్ ఈ విషయమై మాట్లాడుతూ, ఇండియాలో ఓ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుకు వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదేనని, 50 వేల మంది రైతులకు లబ్ది చేకూరనుందని, ఇండియాలో అతిపెద్ద పేపర్ యూనిట్ కూడా ఇదే కానుందని అన్నారు. 12 నెలల వ్యవధిలోనే ఈ ప్లాంటుకు అవసరమైన అన్ని అనుమతులూ లభించేలా చూస్తామని చెప్పారు. కాగా, ఇండియాలో ఏపీపీ ప్లాంటును భారత పేపర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ కార్యదర్శి రోహిత్ పండిట్ స్వాగతించారు. గత నాలుగైదేళ్లుగా పేపర్ ఇండస్ట్రీ ముడి సరుకుల లభ్యత లేక, ఒత్తిడిలో ఉందని ఆయన అన్నారు.