ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం!
- ఉండవల్లిలో టీడీపీ సమన్వయకమిటీ భేటీ
- నేతల పనితీరును సమీక్షించిన చంద్రబాబు
- నేతల పట్ల కఠినంగా ఉంటానని వార్నింగ్
రాబోయే ఆరు నెలలు తాను కఠినంగా ఉంటాననీ, నేతలందరూ ఎమర్జెన్సీ తరహాలో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాలు టీడీపీ సభ్యత్వ నమోదులో మొదటి మూడు స్థానాల్లో ఉండగా, నెల్లూరు గ్రామీణం, పీలేరు నియోజకవర్గాల్లో అత్యల్పంగా నమోదయింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నేత, మంత్రి అచ్చెన్నాయుడు ఈ భేటీకి రాకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. జిల్లాలో జరిగిన గ్రామ వికాసం కార్యక్రమంలో సైతం మంత్రి సరిగ్గా పాల్గొనడం లేదని వ్యాఖ్యానించారు.