Yadadri Bhuvanagiri District: యాదాద్రిలో చిన్నారుల వ్యభిచారం కేసు.. ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు!

  • హైకోర్టులో చిన్నారుల వ్యభిచారం కేసు 
  • ప్రత్యేక న్యాయస్థానం అవసరమన్న హైకోర్టు 
  • కొత్త న్యాయస్థానం ఫ్రెండ్లీ కోర్టుగా ఉంటుందని వ్యాఖ్య
పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట సమీపంలో చిన్నారులతో కొందరు వ్యభిచార వృత్తిని నిర్వహిస్తున్న విషయం ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తుతం హైకోర్టు స్వయంగా విచారిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు చిన్నారులను రక్షించిన పోలీసులు వారిని రెస్క్యూ హోమ్స్ కు తరలించారు. ఈ విషయంలో తాజాగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది.

చిన్నారులను వ్యభిచార రొంపిలోకి దించిన వ్యవహారంపై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామని హైకోర్టు తెలిపింది. ఇది చిన్నారులకు ఫ్రెండ్లీ కోర్టుగా ఉంటుందని వెల్లడించింది. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.
Yadadri Bhuvanagiri District
brothel case
girl child
High Court
Telangana

More Telugu News