నల్గొండలో వేముల వీరేశం వర్సెస్ దుబ్బాక సతీశ్.. భారీగా మోహరించిన పోలీసులు!
- నేరేడలో నేడు వీరేశం పర్యటన
- బాకీ చెల్లించాలని సతీశ్ వర్గీయుల పోస్టర్లు
- పర్యటన రద్దుచేసుకున్న వీరేశం
ఈ నేపథ్యంలో దుబ్బాక సతీశ్ రెడ్డి వర్గీయులు వీరేశం పర్యటనను అడ్డుకోవచ్చన్న అనుమానంతో భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం ఈ విషయాన్ని వేముల వీరేశంకు అధికారులు తెలియజేశారు. చివరికి అనుచరులతో చర్చించిన వేముల వీరేశం.. నేరేడలో తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో అధికారులు భద్రతను ఉపసంహరించుకున్నారు.