జనాలను వెర్రోళ్లను చేయవద్దు: శివసేనపై ఖర్గే మండిపాటు
- ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటన ఓట్ల గిమ్మిక్కే
- అయోధ్యకు వెళ్లకుండా ఇన్ని రోజులు ఆయనను ఎవరు ఆపారు?
- ఎన్నికల సమయం కావడంతో... ఇప్పుడు అందరూ అయోధ్యకు క్యూ కడుతున్నారు
సమస్యల్లో ఉన్నప్పుడే ప్రజలు భగవంతుడుని తలచుకుంటారని కన్నడలో ఓ సామెత ఉందని... అదే విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీకి రాముడు గుర్తుకొస్తాడని ఖర్గే దుయ్యబట్టారు. రెండు రోజుల పర్యటనకు గాను ఉద్ధవ్ థాకరే అయోధ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ తేదీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు శివసేన, వీహెచ్పీలు ఈ రోజు కార్యక్రమాలను నిర్వహించాయి.