pawan kalyna: చెన్నైలో పవన్‌కు ఘన స్వాగతం... విమానాశ్రయానికి పోటెత్తిన అభిమానులు

  • చెన్నై చేరుకున్న పవన్ కల్యాణ్
  • కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న జనసేనాని
  • కీలక ప్రకటన చేసే అవకాశం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి, ఆహ్వానం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో, బౌన్సర్ల సాయంతో ఆయన కారులోకి చేరుకున్నారు. మరో అరగంటలో ఆయన మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈరోజు ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ చెన్నై పర్యటన నేపథ్యలో, సర్వత్ర ఆసక్తి నెలకొంది.

More Telugu News

pawan kalyna
janasena
chennai