భారీ దోపిడీ.. యూపీలో ఆభరణాల దుకాణంలో రూ. 140 కోట్ల విలువైన నగల చోరీ!
- కాన్పూర్ లోని ఆభరణాల దుకాణంలో దొంగతనం
- ఐదేళ్ల క్రితం కోర్టు ఆదేశాలతో షాప్ సీజ్
- తిరిగి తెరిచే ప్రయత్నాల్లో ఉండగానే ఈ ఘటన
- సీరియస్ గా తీసుకున్న పోలీసులు
షాపు యజమానులు వివాదంతో కోర్టుకు ఎక్కడంతో 2013లో జ్యూయెలరీ షాపును కోర్టు ఆదేశాలతో సీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కేసు పరిష్కారం కాగా, తిరిగి షాపును తెరచుకోవచ్చంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో మంచిరోజు చూసి షాపును తెరవాలని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఆభరణాలతో పాటు షాపుకు చెందిన కొన్ని కీలక దస్త్రాలను కూడా దొంగలు తీసుకెళ్లినట్టు పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, దొంగలను గుర్తించేందుకు అన్ని మార్గాల్లో అన్వేషణ సాగిస్తున్నామని తెలిపారు.