KTR: ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే అవకాశమొచ్చింది: కేటీఆర్‌

  • మహాకూటమిలోని పార్టీలు విడిపోకుండా చూడాలి
  • ఆ కూటమి అధికారంలోకి వస్తే సీఎంగా ఎవరుంటారు?
  • మూడు నెలలకోసారి సీఎం మారడం ఖాయం

మహాకూటమిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, మహాకూటమిలోని పార్టీలు విడిపోకుండా చూడాలని, ఆ కూటమి అధికారంలోకి వస్తే సీఎంగా ఎవరుంటారు? అంటే, ఆ కూటమిలో ఉన్న వాళ్లంతా ఈ పదవి కావాలనేవారేనని, ఈ కూటమి అధికారంలోకొస్తే మూడు నెలలకోసారి సీఎం మారడం ఖాయమని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని, ఈ కూటమిలో తెలంగాణ జనసమితి, సీపీఐ కూడా భాగస్వాములుగా చేరాయని, ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే అవకాశం వచ్చిందని అన్నారు.

More Telugu News