లాలూ ప్రసాద్ భార్య, కుమారుడికి ఊరట!
- ఐఆర్సీటీసీ కుంభకోణంలో బెయిల్ మంజూరు
- కోర్టుకు హాజరు కాలేని లాలూ
- తదుపరి విచారణ సెప్టెంబర్ 6కు వాయిదా
లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో... 2005లో రాంచీ, పూరీలో ఉన్న రెండు ఐఆర్సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్టు సీబీఐ వాదిస్తోంది. ఈ హోటల్ యజమానులు లాలూ కుటుంబానికి అత్యంత సన్నిహితులని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే లాలూ కుటుంబసభ్యులతో పాటు రైల్వే అధికారులపై కూడా చార్జిషీటు దాఖలు చేసింది.