ఆసియా క్రీడల్లో భారత్ కు నిరాశ.. బ్యాడ్మింటన్ మహిళల టీమ్ ఔట్!
- ఆసియా క్రీడల్లో భారత్ కు ఎదురుదెబ్బ
- క్వార్టర్ లోనే వెనుదిరిగిన మహిళల బ్యాడ్మింటన్ టీమ్
- జపాన్ చేతిలో ఘోర పరాజయం
పీవీ సింధు 21-18, 21-19తో యమగూచిపై విజయం సాధించి భారత్కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత డబుల్స్లో సిక్కిరెడ్డి- ఆరతి 15-21, 6-21తో ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో భారత్ ఆధిక్యానికి తెరపడింది. మరో సింగిల్స్లో సైనా 11-21, 25-23, 16-21 తేడాతో ఒకుహార చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన మరో డబుల్స్లో సింధు-పొన్నప్ప జోడీ కూడా ఓడిపోయింది. దీంతో ఈ ఆసియా క్రీడల్లో మహిళల టీమ్ ఈవెంట్లో భారత మహిళల పోరుకు తెర పడింది. ఏ పతకం లేకుండా నిరుత్సాహంగా మహిళల టీమ్ వెనుదిరిగింది.