air india: అలవెన్సులు ఇవ్వలేదో.. విమానాలు నడపడం ఆపేస్తాం!: ఎయిర్ ఇండియాకు పైలెట్ల అల్టిమేటం

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు పైలెట్లు షాక్ ఇచ్చారు. తమకు బాకీపడ్డ అలవెన్సులను వెంటనే చెల్లించకపోతే విమానాలను నడపడం ఆపేస్తామని హెచ్చరించారు. జూలై వేతనాలను ఆలస్యంగా ఆగస్టులో చెల్లించడంపై మండిపడ్డారు.

సాధారణంగా పైలెట్లకు అందే ప్యాకేజీలో వేతనం కేవలం 30 శాతమే ఉంటుంది. మిగతావన్నీ అలవెన్సుల రూపంలోనే ఉంటాయని ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ తెలిపింది. ఎయిర్ఇండియా సంస్థ పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది తప్ప మిగతా అందరికీ అలవెన్సులు చెల్లిస్తోందని ఆరోపించింది. జూన్ నెలలో చెల్లించాల్సిన అలవెన్సులను కూడా ఇప్పటివరకూ ఎయిర్ఇండియా ఇవ్వలేదని స్పష్టం చేసింది. కేవలం జీతం మాత్రమే ఇస్తున్నందున ఆఫీస్ కు వచ్చి కూర్చుంటామనీ, ఫ్లయింగ్ అలవెన్సులు ఇవ్వకుంటే విమానాలను నడపబోమని పైలెట్లు తేల్చిచెబుతున్నారు. ఈ మేరకు ఎయిర్ఇండియాకు నోటీసులు జారీచేశారు.
air india
pilots
allowence
air

More Telugu News