vajpayee: మరణాన్ని ముందే గుర్తించిన వాజ్ పేయి!

  • ఏడేళ్ల క్రితమే మరణాన్ని గుర్తించిన వాజ్ పేయి
  • తాను వెళ్లిపోయే సమయం ఆసన్నమైందని చెప్పిన మాజీ ప్రధాని
  • ఈ విషయాన్ని ఆవేదనతో చెప్పిన శివకుమార్ శర్మ

ఈ లోకం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమైందని దివంగత వాజ్ పేయి ఏడేళ్ల క్రితమే గుర్తించారట. తన వ్యక్తిగత కార్యదర్శి శివకుమార్ శర్మతో 'నేను వెళ్లిపోయే సమయం ఆసన్నమైంది' అని చెప్పారట. ఈ విషయాన్ని శివకుమార్ ఎంతో ఆవేదనతో తెలిపారు. వాజ్ పేయి వద్ద శివకుమార్ 50 ఏళ్లకు పైగా పని చేశారు.

2011 తర్వాత వాజ్ పేయి ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ వచ్చిందని... కొన్ని రోజుల్లో ఎయిమ్స్ లో అడ్మిట్ చేస్తారనే సమయంలో... 'శర్మా, నేను వెళ్లిపోయే సమయం వచ్చేసింది' అని చెప్పారని శివకుమార్ గుర్తుచేసుకున్నారు.

More Telugu News