నాకు ప్రాణం పోసింది రాజీవ్ గాంధీనే: వాజ్పేయి కృతజ్ఞత
- వాజ్పేయికి కిడ్నీ సమస్య
- స్వయంగా పిలిపించుకుని మాట్లాడిన రాజీవ్ గాంధీ
- ఆయన చలువతోనే న్యూయార్క్లో చికిత్స
విషయం తెలిసిన వెంటనే వాజ్పేయిని తన కార్యాలయానికి రమ్మని రాజీవ్ ఆహ్వానించి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు వెళ్లే బృందంలో మిమ్మల్ని కూడా చేర్చుతున్నానని, కాబట్టి సదస్సు అనంతరం న్యూయార్క్ వెళ్లి వైద్యం చేయించుకోవాలని వాజ్పేయికి సూచించారు. దీనికి వాజ్పేయి సరేననడంతో అలా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని వాజ్పేయి స్వయంగా సీనియర్ పాత్రికేయుడు కరణ్ థాపర్తో పంచుకున్నారు. తానీ రోజు బతికి ఉన్నానంటే దానికి కారణం రాజీవ్ గాంధీయేనని వాజ్పేయి పలుమార్లు పేర్కొన్నారు.