టీమిండియాకు షాక్.. దినేష్ కార్తీక్ ఔట్
- టీమిండియాను దెబ్బతీసిన ఆండర్సన్
- తొలి ఓవర్ చివరి బంతికి కార్తీక్ ఔట్
- కోహ్లీకి జత కలిసిన పాండ్యా
ఆండర్సన్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కార్తీర్ 2 పరుగులు సాధించాడు. ఓవర్ చివరి బంతి కార్తీక్ బ్యాట్ ను ముద్దాడి, సెకండ్ స్లిప్ లోకి వెళ్లింది. ఈ సారి మాత్రం ఎలాంటి తప్పు చేయకుండా డేవిడ్ మలాన్ క్యాన్ ను అందుకున్నాడు. దీంతో భారత్ ఆదిలోనే కార్తీక్ (20) వికెట్ కోల్పోయి ప్రమాదంలో పడిపోయింది.
అనంతరం కోహ్లీకి పాండ్యా జత కలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు. కోహ్లీ 45, పాండ్యా 3 పరుగులతో ఆడుతున్నారు. భారత్ విజయానికి మరో 77 పరుగులు అవసరం. నిన్న కోహ్లీ ఇచ్చిన రెండు క్యాచ్ లను మలాన్ అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే.