ఇంగ్లండ్లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ!
- తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ సెంచరీ
- ఇంగ్లండ్ గడ్డపై విరాట్కు ఇదే తొలి శతకం
- టెస్టు కెప్టెన్గా 15వది
ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 287 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే, ఇంగ్లండ్ బౌలర్ శామ్ కర్రన్ ధాటికి భారత బ్యాట్స్మన్ క్రీజులో కుదురుకోలేకపోయారు. 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో కోహ్లీ సమయోచితంగా ఆడుతూ జట్టు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించి జట్టు పరువు కాపాడాడు. మొత్తం 225 బంతులు ఎదుర్కొన్న విరాట్ 22 ఫోర్లు, సిక్సర్తో 149 పరుగులు చేశాడు. అయితే, కోహ్లీకి అండగా నిలిచేవారు కరువయ్యారు. దీంతో భారత్ 274 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించింది.