శివసేన సంచలన నిర్ణయం.. ముస్లిం రిజర్వేషన్లకు మద్దతు

  • విద్యలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశానికి మద్దతు
  • ముస్లింలు రిజర్వేషన్లు కోరడం సమంజసమే అన్న శివసేన
  • అన్ని వర్గాల రిజర్వేషన్ డిమాండ్లను పరిగణించాలంటూ సూచన
కరుడుగట్టిన హిందూ పార్టీగా ముద్ర పడిన శివసేన సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనార్టీలకు విద్యలో 5 శాతం రిజర్వేషన్ కల్పించే అంశానికి మద్దతు పలికింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది.

మరాఠా రిజర్వేషన్లతో పాటు ధన్ గర్స్, ముస్లిం, ఇతర రిజర్వేషన్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారు. తమ వర్గానికి కూడా రిజర్వేషన్లు కావాలని ముస్లింలు డిమాండ్ చేయడం సమంజసమైనదేనని చెప్పారు. మరోవైపు, శివసేన నిర్ణయాన్ని ఎంఐఎం స్వాగతించింది. 
Go Back to Shorts
shiv sena
udhav thakarey
muslim
reservations
mim

More Telugu News