బీజేపీ భయపడుతోంది.. అందుకే స్వల్పకాలిక చర్చ: సీఎం రమేష్

ఏపీ విభజన హామీలపై రాజ్యసభలో ఈరోజు జరగనున్న స్వల్పకాలిక చర్చలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. రూల్ 168 కింద చర్చ చేపడితే, ఓటింగ్ జరుగుతుందని బీజేపీ భయపడుతోందని... అందుకే ఈ అంశంపై స్వల్పకాలిక చర్చకు అంగీకరించిందని ఎద్దేవా చేశారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా విభజన చట్టం అమలుపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లు మాట్లాడకపోవడాన్ని ఈ రోజు రాజ్యసభలో లేవదీస్తామని చెప్పారు. ఇతర పార్టీల మద్దతుతో ఏపీ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళతామని అన్నారు.


More Telugu News