భక్తుల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం: టీటీడీ ఈవో
- ఈ నెల 24న టీటీడీ బోర్డు సమావేశం
- అప్పటిలోగా భక్తులు తమ అభిప్రాయాలు చెప్పాలి
- సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం తగదు
భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని, మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని అనుకుంటున్నామని, ఒకవేళ ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తే మిగిలిన వారు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మహా సంప్రోక్షణ సమయంలో రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు రెండు విడతలుగా భక్తులకు దర్శనం కల్పించే విషయమై యోచిస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 24న తుది నిర్ణయం తీసుకున్న తర్వాతనైనా ఈ ఆరోపణలకు తెరపడుతుందని భావిస్తున్నామని అన్నారు.