ఫ్రాన్స్ ను వెనక్కి నెట్టి ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్!
- 2017 ఫిగర్స్ ను విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్
- అగ్ర స్థానంలో అమెరికా... ఐదో స్థానంలో బ్రిటన్
- 2032 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగనున్న భారత్
గత దశాబ్ద కాలంలో భారత్ జీడీపీ ఏకంగా రెట్టింపు అయింది. రానున్న రోజుల్లో ఆసియాలో కీలకమైన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ ఎదగనుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో చైనా వృద్ధి రేటు తగ్గే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
లండన్ కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసర్చ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు మాట్లాడుతూ... 2018 చివరకల్లా బ్రిటన్, ఫ్రాన్స్ లను భారత్ అధిగమిస్తుందని తెలిపారు. 2032 కల్లా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం 2017 చివరి నాటికి ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా బ్రిటన్ ఉంది. ఈ జాబితాలో అమెరికా అగ్ర స్థానంలో ఉండగా చైనా, జపాన్, జర్మనీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.