కేటీఆర్.. సోనియా కాళ్లు కడిగి, నెత్తిన చల్లుకో: అంజన్ కుమార్ యాదవ్
- తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్లే రాష్ట్రం వచ్చింది
- హైకమాండ్ తో కొట్లాడి.. రాష్ట్రాన్ని సాధించుకున్నాం
- కేటీఆర్ నోటి దురుసును తగ్గించుకోవాలి
సోనియాగాంధీ కాళ్లు కడిగి, నెత్తిన చల్లుకుంటే పుణ్యమైనా వస్తుందని కేటీఆర్ కు సలహా ఇచ్చారు. నోటి దురుసును కేటీఆర్ తగ్గించుకోవాలని అన్నారు. గత నాలుగేళ్లలో కోట్లాది రూపాయల అవినీతికి కేటీఆర్ పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పై ఏ మాత్రం గౌరవం ఉన్నా... రాష్ట్రం కోసం పోరాడిన ఎంపీలపై పోటీ పెట్టకూడదని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని దుయ్యబట్టారు. అబద్ధాలతోనే కేసీఆర్ గద్దెనెక్కారని విమర్శించారు.