akhil: దసరా బరిలోకి అఖిల్ మూవీ?

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • ఫారిన్ లో మేజర్ షెడ్యూల్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ తన తాజా చిత్రం చేయనున్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ను ఫారిన్ లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. నిధి అగర్వాల్ కథానాయికగా నటించనున్న ఈ సినిమా షూటింగును ఫారిన్ లో ఏకధాటిగా చేయనున్నారట. ఇది మేజర్ షెడ్యూల్ అనీ .. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నామని చెబుతున్నారు.

వెంకీ అట్లూరి చేసిన పక్కా ప్లానింగ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ సాధ్యమైనంత త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉందనీ, దసరాకి విడుదల చేయాలనే ఉద్దేశంలో దర్శక నిర్మాతలు వున్నారని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టైటిల్ బాగుందనే ఫీడ్ బ్యాక్ కూడా అక్కినేని అభిమానుల నుంచి వచ్చినట్టుగా చెబుతున్నారు. అదే టైటిల్ ను ఖరారు చేస్తారేమో చూడాలి.       

More Telugu News