ముంబై ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం... మాల్యా, నీరవ్ ఫైల్స్ సేఫంటున్న అధికారులు!
- మంటలు విస్తరించక ముందే ఫైల్స్ తరలించాం
- వెల్లడించిన ఐటీ అధికారులు
- మంటలను అదుపు చేసేందుకు శ్రమించిన 120 మంది
మంటలు ప్రారంభం కాగానే, భవంతిలో చిక్కుకున్న ఆరుగురిని ప్రాణాలతో రక్షించామని, దాదాపు 120 మంది ఫైర్ మెన్లు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారని డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర చౌదరి వెల్లడించారు. ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. కాగా, ఏ కారణంతో భవనానికి నిప్పంటుకుందన్న విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు.