ఇక మా గేమ్ మొదలవుతుంది: రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు
- అన్ని విభజన హామీల అమలు కాంగ్రెస్ వస్తేనే సాధ్యం
- చంద్రబాబు, రాహుల్ కాకతాళీయంగానే కలిశారు
- కాంగ్రెస్ ను వీడేది లేదన్న రఘువీరా
చంద్రబాబు, రాహుల్ గాంధీలు బెంగళూరులో కలిసింది కాకతాళీయమేనని, తెలుగుదేశంతో పొత్తులపై ఇంతవరకూ ఎలాంటి చర్చలూ జరగలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టం చేసిన ఆయన, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనింకా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టు కనిపించడం లేదని, బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ పాలక మండలిలో పదవిని ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్తను మహానాడు వేదికపై కూర్చోబెట్టారని, ఇవన్నీ చూస్తుంటే, బీజేపీతో కటీఫ్ చెప్పినట్టు ఎలా నమ్మాలని అడిగారు.