కాంగ్రెస్ ముందు జాగ్రత్త.. జేడీఎస్కే సర్వాధికారాలు!
- ఐదేళ్లూ కూటమి అధికారంలో ఉండేలా కాంగ్రెస్ ప్లాన్
- అధికారం కోసం పట్టుబట్టకూడదని నిర్ణయం
- నిర్ణయాధికారం జేడీఎస్కే
కాగా, ఇకపై ఎలా పనిచేయాలో కూటమి నేతలందరం కలుసుకుని మాట్లాడుకుంటామని, ఒకసారి మాట్లాడుకుని నిర్ణయించుకున్నాక ఆ విధంగా ముందుకెళ్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి అన్నారు. దళితుడు, లేదంటే ముస్లింను ఉప ముఖ్యమంత్రి పదవిలో నియమిస్తానన్న హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా కేపీసీసీ చీఫ్ జి.పరమేశ్వరను కుమారస్వామి ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతోపాటు కుమారస్వామి సోదరుడు హెచ్డీ రేవణ్ణ, చాముండేశ్వరిలో సిద్ధరామయ్యను ఓడించిన జీటీ దేవెగౌడ, చామరాజనగర్ నుంచి గెలుపొందిన బీఎస్పీ అభ్యర్థి బి.మల్లేష్లకు కేబినెట్ స్థానాలు ఖాయంగా తెలుస్తోంది.