Jagan: అదే తేదీన రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేశా!: వైఎస్ జగన్

  • ప్రజా సంకల్పయాత్రలో 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న జగన్
  • ఏలూరు మండలం వెంకటాపురంలో పైలాన్ ఆవిష్కరణ
  • 2004, మే 14న ఏపీ సీఎంగా వైఎస్ ప్రమాణ స్వీకారం చేశారు
  • అదే తేదీన రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేశా!
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకటాపురంలో పైలాన్ ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ ని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అభినందించారు. 

కాగా, రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తీసుకొస్తానని, అందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే తన సంకల్పమని జగన్ ఓ ట్వీట్ చేశారు.. 2004, మే 14న ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారని, అదే తేదీన రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేశానని అన్నారు. వైఎస్ ముందుచూపు, ఆయన చేపట్టిన అభివృద్ధి పథకాలు నిరుపమానమని ప్రశంసించారు.
Jagan
ys
pylon
2000

More Telugu News