balakrishna: వినాయక్ తో బాలకృష్ణ .. మళ్లీ శ్రియకే ఛాన్స్

  • వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ 
  • కథానాయికగా శ్రియ 
  • త్వరలోనే సెట్స్ పైకి      

బాలకృష్ణ ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూనే, మరో వైపున వినాయక్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో కథను రెడీ చేయడంలో వినాయక్ సిద్ధహస్తుడు. ఇక మాస్ ఆడియన్స్ ను మెప్పించడం ఎలాగో బాలయ్యకి బాగా తెలుసు.అలాంటి ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా శ్రియను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. గతంలో బాలకృష్ణ సరసన శ్రియ 'చెన్నకేశవరెడ్డి' .. 'గౌతమీపుత్ర శాతకర్ణి' .. ' పైసా వసూల్' చిత్రాల్లో నటించింది. నాలుగోసారి ఆమె ఈ సినిమాలో బాలకృష్ణ జోడీ కడుతోంది. వివాహమైన తరువాత శ్రియ చేస్తోన్న మొదటిసినిమా ఇదే కావడం విశేషం.     

More Telugu News