మహేశ్ బాబు నటించిన 'అతడు' సినిమాలోని డైలాగ్ కొట్టిన వరుణ్ తేజ్!
‘గన్ను చూడాలనుకోండి తప్పులేదు.. కానీ, బులెట్ చూడాలనుకోవద్దు చచ్చిపోతావు’ అంటూ గతంలో సినీనటుడు మహేశ్ బాబు అతడు సినిమాలో డైలాగు కొట్టి అలరించిన విషయం తెలిసిందే. తాజాగా అదే డైలాగును మెగా హీరో వరుణ్ తేజ్ ఓ వేదికపై చెప్పి ఆకట్టుకున్నాడు. అమెరికాలోని డల్లాస్లో జరిగిన 'మా' సెలబ్రేషన్స్లో వరుణ్ ఇలా మహేశ్ బాబు డైలాగ్ని చెప్పాడు. అంతేగాక, ఇదే వేదికపై హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్తో కలిసి అల్లు అర్జున్ సాంగ్ 'సీటీ మార్'కు స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరూ చూడండి...