దగాపడిన తెలుగు ప్రజలారా తరలి రండి: నారా లోకేష్

  • తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను విస్మరించారు
  • జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి  చంద్రబాబు సారథ్యంలో ప్రశ్నించండి
  • ట్విట్ చేసిన మంత్రి లోకేష్
కాసేపట్లో ప్రారంభం కానున్న ధర్మ పోరాట బహిరంగ సభకు ప్రజలంతా తరలిరావాలని మంత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. 'తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను విస్మరించి, తెలుగువారిని నమ్మించి ద్రోహం చేసిన కేంద్ర మోసాన్ని, తిరుపతిలోని అదే వేదిక నుంచి చంద్రబాబు గళమెత్తి ప్రశ్నిస్తున్నారు. దగాపడిన తెలుగు ప్రజలారా తరలిరండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అన్యాయాన్ని ప్రశ్నించండి' అంటూ మంత్రి లోకేష్ ట్విట్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Special Category Status

More Telugu News