చిన్నబోయిన చెన్నై... ముంబైకి రెండో విజయం!
- పాయింట్ల పట్టికలో కదిలిన ముంబై ఇండియన్స్
- చెన్నై హోమ్ గ్రౌండ్ లో చిరస్మరణీయ విజయం
- 8 వికెట్ల తేడాతో గెలుపు
- హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
గత రాత్రి జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రైనా 75, అంబటి రాయుడు 46 పరుగులు చేసి రాణించారు. 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 170 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 33 బంతుల్లోనే 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలువగా, ఓపెనర్ లూయిస్ 43 బంతుల్లో 47 పరుగులు చేసి గెలుపులో కీలక బాధ్యతలు పోషించాడు. ఈ మ్యాచ్ తరువాత ముంబై ఇండియన్స్ జట్టు తానాడిన 7 మ్యాచ్ లలో 2 గెలుపులతో నాలుగు పాయింట్లు సాధించి, మెరుగైన రన్ రేటు కారణంగా పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.