నగదుకు తీవ్ర కటకటలు... సరిపడా ఉందంటూ జైట్లీ పోలిక లేని ట్వీట్లు
- బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంది
- కొన్ని చోట్ల డిమాండ్ పెరగడంతో కొరత
- దాన్ని పరిష్కరించామన్న ఆర్థిక మంత్రి
‘‘దేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం జరిగింది’’ అని జైట్లీ ట్వీట్ చేశారు. మరోవైపు నగదు లభ్యతను పరిశీలించేందుకు ఆర్ బీఐ ఈ రోజు ఓ కమిటినీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆర్థిక శాఖకు ఆర్ బీఐ పంపిన సమాచారం మేరకు ఏపీ, తెలంగాణ, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకుల్లో ఉన్న నగదు కంటే ఉపసంహరణలు ఎక్కువ అయ్యాయి.