ఏపీ బస్సులపై ప్రతాపం చూపుతున్న తమిళ తంబీలు!
- తమిళనాట కొనసాగుతున్న బంద్
- శివారు ప్రాంతాల్లో ఏపీ బస్సుల ధ్వంసం
- స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు
విపక్షాలు పిలుపునిచ్చిన ఈ బంద్ కు అధికార అన్నాడీఎంకే కూడా సహకరిస్తుండటంతో బంద్ సంపూర్ణంగా సాగుతోంది. రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగానే మూసివేశారు. విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, పలు చోట్ల స్కూళ్లు తెరచుకోలేదు. కాగా, పలు ప్రాంతాల్లో డీఎంకే నేతలు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు.