నేటి నుంచి కామన్వెల్త్ క్రీడా సంబరం.. 17 క్రీడాంశాల్లో పోటీపడుతున్న భారత్
- 12 రోజులపాటు క్రీడా పండుగ
- సత్తా చాటేందుకు సిద్ధమైన 71 దేశాల క్రీడాకారులు
- 17 క్రీడాంశాల్లో పోటీపడుతున్న భారత్
భారత్ 17 క్రీడాంశాలలో పోటీ పడుతోంది. 115 మంది పురుష అథ్లెట్లు, 105 మంది మహిళా అథ్లెట్లతో మొత్తం 225 మంది గోల్డ్కోస్ట్ చేరుకున్నారు. ఈసారి అత్యధిక పతకాలతో భారత్ తిరిగి రావాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఏవోసీ) పట్టుదలగా ఉంది.
ఇప్పటి వరకు 16 సార్లు భారత్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంది. 1930లో జరిగిన క్రీడల్లో భారత్ ఒకే ఒక్క కాంస్య పతకం సాధించి సంతృప్తి పడింది. 1958లో తొలిసారి స్వర్ణం కొల్లగొట్టింది. ఆ తర్వాతి నుంచి భారత ఆటగాళ్లు కామన్వెల్త్లో పతకాలు కొట్టుకు రావడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ఢిల్లీలో భారత్ ఆతిథ్యమిచ్చిన సీడబ్ల్యూసీ గేమ్స్లో 39 స్వర్ణాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది .