అమరావతిలో కూర్చుని అఖిలపక్షం పెడితే లాభం లేదు : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- అందరం కలిసి రాజీనామాలు చేద్దాం
- కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది
- స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం
- టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే లాలూచీ పడ్డట్టే
ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం కీలక దశలో ఉదని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని అన్నారు. ఏమైనా రాజకీయాలు ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసుకుందామని, ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాడదామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులు వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే లాలూచీ పడినట్లేనని విమర్శించారు. ముందుగా ప్రకటించినట్టే ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, ఆ తేదీ కన్నా ముందే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా తమకు అభ్యంతరం లేదని మిథున్ రెడ్డి అన్నారు.