karthi chidambaram: కార్తీ చిదంబరానికి ఊరట.. బెయిల్ మంజూరు

  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు విడుదల
  • విదేశాలకు వెళ్లరాదని ఆదేశం
  • కార్తీ తరఫున వాదించిన కపిల్ సిబాల్, అభిషేక్ మను
ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మండలి అనుమతులకు సంబంధించిన కేసులో కార్తీ చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసింది. షరతుల్లో భాగంగా ఆయన విదేశాలకు వెళ్లరాదని ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీకి ఊరట లభించినట్టయింది. కాగా, కార్తీ తరపున ప్రముఖ న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి తమ వాదనలు వినిపించారు. కాగా, ఇరవై మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం బెయిల్ లభించడం గమనార్హం.

More Telugu News

karthi chidambaram
bail