మాల్యాకు మరో ఎదురు దెబ్బ.. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కేసులో అరెస్ట్ వారెంట్!
- ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకుంటున్న మాల్యా
- కంపెనీ చట్టాలను ఉల్లంఘించిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్
- మాల్యా సహా 18 మందిపై అరెస్ట్ వారెంట్లు
2012లో ప్రారంభమైన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ చట్టాలను ఉల్లంఘించిందని ఎస్ఎఫ్ఐఓ కోర్టుకు తెలిపింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు సంస్థ పనిచేస్తుంది.
కంపెనీస్ యాక్ట్ ప్రకారం బెంగళూరులో ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో మాల్యా సహా మరో 18మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలని ఆదేశించింది. దాదాపు రూ.9 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకుంటున్నాడు.