బిల్డింగ్ ఎక్కి పతంగులు ఎగరేసి అలరించిన ఎమ్మెల్యే రోజా.. మీరూ చూడండి!
సంక్రాంతి సందర్భంగా విభిన్న రంగులతో వింతైన ఆకారాలతో ఉన్న గాలిపటాలను ఎగరేస్తూ ప్రజలు ఆకాశమంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తన పిల్లలతో కలిసి బిల్డింగ్పై పతంగులు ఎగరేసి ఎంజాయ్ చేశారు. పతంగులు ఇలా ఎగురవేయాలంటూ రోజా తన కుమారుడికి చూపించారు. పక్కనే ఆమె కుటుంబ సభ్యులు మరో గాలిపటాన్ని ఎగురవేశారు. తాను పతంగి ఎగురవేస్తుండగా తీసిన వీడియోను రోజా తన యూ ట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశారు. మీరూ చూడండి..