రిజర్వాయర్ పనుల విషయంలో ఏజెన్సీకి ఫైనల్ నోటీసు జారీ: మంత్రి హరీశ్రావు
- పెండ్లిపాకల రిజర్వాయర్ పనుల విషయంలో నోటీసులు
- వెంటనే పనులు ప్రారంభించకపోతే మళ్లీ టెండర్లు
- 470 కోట్లతో డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు
- 60 శాతం పూర్తయ్యాయి
మిగతా పనులు కూడా 2018 వానాకాలం నాటికి పూర్తయ్యేలా ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 7.50 టీఎంసీలని చెప్పారు. ఇందులో 4 టీఎంసీలను వచ్చే వర్షాకాలం కల్లా నిల్వ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. డి.బి.ఆర్.కు చెందిన ఒకటవ టన్నెల్ 43 కిలోమీటర్లలో 30 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయినట్టు మంత్రి చెప్పారు. మిగతా పనులు కూడా పుంజుకున్నాయన్నారు.
అలాగే రెండవ టన్నెల్ తవ్వకం పనులు 100 శాతం పూర్తయినట్టు హరీశ్ రావు తెలియజేశారు. 50 శాతం లైనింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. పెండ్లిపాకల రిజర్వాయర్ పనుల విషయంలో ఏజెన్సీకి ఫైనల్ నోటీసు జారీ చేశామని, వెంటనే పనులు ప్రారంభించకపోతే మళ్లీ టెండర్లు పిలుస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.