సోలార్ విద్యుత్ తయారీ రంగంలోకి ప్రవేశించనున్న పతంజలి
- వెల్లడించిన ఎండీ ఆచార్య బాలకృష్ణ
- వ్యవస్థాపనా రంగంలో పతంజలి వారి మొదటి ప్రయత్నం
- 30 శాతం మూలధన సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం
వ్యవస్థాపనా రంగంలో పతంజలి వారు ప్రవేశించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు వినియోగదారుల సరుకుల రంగంలో ఎదురులేకుండా పతంజలి లిమిటెడ్ నడుస్తోంది. సోలార్ తయారీ ప్లాంట్లు పెట్టడానికి సౌర విద్యుత్ పాలసీలో భాగంగా ప్రభుత్వం తరఫు నుంచి 30 శాతం సబ్సిడీ కూడా లభించనుంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకుని చైనా కంపెనీల్లా కాకుండా నాణ్యమైన సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేస్తామని బాలకృష్ణ అన్నారు.