రిజర్వేషన్లపై మోదీ వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల్లో అనుమానాలు!
- రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది
- తెలంగాణలో ముస్లింలకు 12 శాతం.. ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు
- బిల్లుల ఆమోదంపై అనుమానాలు
ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ, 'యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీయే అవుతుంద'ని అన్నారు. అంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితిని దాటడం వీలుపడదని స్పష్టం చేశారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులిద్దరూ సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటే నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కాపు సామాజిక వర్గానికి 5 శాతం రిజర్వేషన్ ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన ఈ రిజర్వేషన్ల బిల్లులు కార్యరూపం దాల్చుతాయా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.