జైలు నుంచి విడుదలయ్యేందుకు రూ.6500 కోట్లు చెల్లించిన సౌదీ యువరాజు

అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష ఎదుర్కుంటోన్న సౌదీ అరేబియా యువరాజు మితెబ్‌ బిన్‌ అబ్దుల్లా ప్ర‌భుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్నారు. దీని ప్ర‌కారం జైలు నుంచి విడుద‌ల కావ‌డానికి రూ.6500 కోట్లకు పైగా స‌ర్కారుకు చెల్లించేందుకు మితెన్ బిన్ అబ్దుల్లా ఒప్పుకున్నారు. అవినీతికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో 20 రోజుల క్రితం ఆయ‌న‌ను అరెస్టు చేశారు. తాను సంపాదించిన‌ అక్రమాస్తుల‌ను ఆయ‌న స‌ర్కారుకి అప్పగించేందుకు ఒప్పుకోవ‌డంతో యువ‌రాజును జైలు నుంచి విడుద‌ల చేశారు.      


More Telugu News