'పద్మావతి' విషయంలో చరిత్రకారులను సంప్రదించనున్న సీబీఎఫ్సీ?
- సర్టిఫికెట్ ఇవ్వడానికి సమయం పట్టే అవకాశం
- దేశవ్యాప్తంగా రగులుతున్న 'పద్మావతి' వివాదం
- విడుదలపై సందిగ్ధం
'పద్మావతి' సినిమాలో ప్రధాన పాత్రలైన పద్మావతి, రతన్ సింగ్, అల్లా ఉద్దీన్ ఖిల్జీల మధ్య ఉన్న సంబంధం గురించి స్పష్టత వచ్చేవరకు సినిమా విడుదలవుతుందో లేదోనన్న సందిగ్ధం ఏర్పడింది. ఈ సినిమాలో రాజ్పుత్ రాణుల గౌరవాన్ని అగౌరవపరిచే సన్నివేశాలు ఉండి ఉంటాయని, చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నాడని రాజ్పుత్ సేనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రారంభమై ఇప్పుడు మొత్తం హిందువుల సమస్యగా రూపాంతరం చెందిన ఈ వివాదానికి సీబీఎఫ్సీ నిర్ణయంతోనే తెరపడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.