ఆధార్ కార్డుతో ఇకపై 12 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు!
- బుకింగ్ పరిమితిని రెట్టింపు చేసిన ఐఆర్ సీటీసీ
- లాగిన్ అయి, ఆధార్ అప్ డేట్ చేసుకుంటే చాలు
- వెల్లడించిన ఐఆర్ సీటీసీ అధికారులు
ఇందుకోసం పోర్టల్లో లాగిన్ అయి, మై ప్రొఫైల్ ను క్లిక్ చేసి, కేవైసీపై క్లిక్ చేయాలని, ఆపై ఆధార్ నంబర్ ను అప్ డేట్ చేస్తే సరిపోతుందని తెలిపారు. కాగా, దేశంలో మొబైల్ ఫోన్లను వాడుతున్న వారు ఎప్పటిలోగా, తమ మొబైల్ నంబర్లకు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలన్న విషయమై ఆయా బ్యాంకులు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కస్టమర్లకు అందిస్తుండాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.