వాగులోకి దూసుకెళ్లిన బస్సు.. మధిర మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు!
- డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న ప్రయాణికులు
- మాజీ ఎమ్మెల్యే వెంకటనర్సయ్యకు తీవ్ర గాయాలు
- హైదరాబాదు నుంచి ఖమ్మం వస్తుండగా ప్రమాదం
మాజీ ఎమ్మెల్యేకు పెదవులు పగిలిపోయాయని, పళ్లు కూడా రాలి ఉండవచ్చని చెబుతున్నారు. చాలా రక్తం పోయిందని తోటి ప్రయాణికులు తెలిపారు. గాయపడ్డవారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు. హైదరాబాదు నుంచి ఖమ్మం వస్తుండగా ఈ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదానికి గురైందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.