మావోయిస్టుల నయా ప్లాన్... బదిలీలు ప్రకటించిన అగ్ర నాయకత్వం
విశాఖ సమీపంలోని ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో భారీ మార్పులు చేయాలని మావో అగ్రనేతలు నిర్ణయించారు. రామగూడ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు తమ ప్రణాళికను మార్చుకుని కమిటీల ప్రక్షాళనకు నడుం బిగించారు. ఈ మేరకు బదిలీలను ప్రకటించారు. మావోయిస్టు కీలక నేత చలపతికి స్థాన చలనం కల్పించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం ఈస్ట్ డివిజన్ కమిటీ బాధ్యతలు చూస్తున్న చలపతిని కోరాపుట్ కమిటీకి బదిలీ చేసినట్టు మావోలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఇకపై ఈస్ట్ డివిజన్ బాధ్యతలను దుబాషి శంకర్ అలియాస్ మహేందర్ కు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మార్పు తక్షణం అమల్లోకి వస్తుందని మీడియాకు ప్రకటనను విడుదల చేశారు.
ప్రస్తుతం ఈస్ట్ డివిజన్ కమిటీ బాధ్యతలు చూస్తున్న చలపతిని కోరాపుట్ కమిటీకి బదిలీ చేసినట్టు మావోలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఇకపై ఈస్ట్ డివిజన్ బాధ్యతలను దుబాషి శంకర్ అలియాస్ మహేందర్ కు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మార్పు తక్షణం అమల్లోకి వస్తుందని మీడియాకు ప్రకటనను విడుదల చేశారు.