: ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు గోవధ సంరక్ష‌కుల ఆందోళ‌న

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘ‌నంగా రాష్ట్రావ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. అక్క‌డి అమ‌రవీరుల స్తూపం వ‌ద్ద తెలంగాణ ప్ర‌భుత్వాధికారులు నివాళులు అర్పించి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అక్క‌డ ఎగ్జిబిష‌న్ నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో గోవధ సంరక్ష‌కులు ఆందోళ‌న నిర్వ‌హించారు. గోవ‌ధ‌ను వ్య‌తిరేకిస్తూ జంతు హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న గోవ‌ధ‌ను అడ్డుకోవాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.     

More Telugu News