: దాసరి అంత్యక్రియలకు 'ఆ ముగ్గురూ' ఎందుకు రాలేదంటే...!

దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూసిన తరువాత, తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ హీరోలుగా చెప్పుకునే నట త్రయం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అంత్యక్రియల్లో పాల్గొనలేదన్న సంగతి తెలిసిందే. వాస్తవానికీ ఈ ముగ్గురితోనూ దాసరి సినిమాలు తీశారు. ఈ ముగ్గురూ దశాబ్దాలుగా చిత్ర సీమను ఏలుతున్నవారే. వీరెవరూ దాసరి మృతదేహాన్ని సందర్శించేందుకు రాలేదు, అంతిమయాత్రలో కూడా కనిపించ లేదు. అయితే, వీరంతా హైదరాబాద్ లో లేని కారణంగానే హాజరు కాలేకపోయారని సమాచారం.

ప్రతి సంవత్సరమూ దక్షిణాది నటీ నటులంతా ఎక్కడో ఒక చోట సమావేశం అవుతారన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం వారంతా జూన్ మొదటి వారంలో చైనాలో కలవాలని నిర్ణయించుకున్నారు. 1980 దశకంలో దక్షిణాది పరిశ్రమను ఓ ఊపు ఊపిన వారంతా ఈ సమావేశం కోసం చైనాకు వెళ్లారు. వారితో పాటు చిరంజీవి, నాగార్జున, చైనాకు వెళ్లగా, బాలకృష్ణ తన కొత్త చిత్రం షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు. దాసరి మరణ వార్త వీరిని కలచివేసినప్పటికీ, వెంటనే బయలుదేరినా కడసారి చూపులు సాధ్యం కాదని తెలియడంతోనే రాలేదని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లోనే ఉన్న వెంకటేష్ మాత్రం దాసరికి నివాళులు అర్పించారు.

More Telugu News