నూనెలో నీళ్లు పడడంతో తిరుమల బూందీపోటులో మంటలు!
తిరుమల శ్రీవారి బూందీపోటులో ఈ రోజు మంటలు చెలరేగాయి. దాంతో సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేయడంతో ఎటువంటి ప్రాణపాయం జరగలేదు. నూనెలో నీళ్లు పడటంతో ఒక్కసారిగా నూనె పొంగి మంటలు చెలరేగాయని అక్కడి సిబ్బంది తెలిపారు. ప్రమాదస్థలికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.