: కాపులతో చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు: ముద్రగడ

కాపు కులస్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆయనకు అనుకూలమైన పత్రికలు, ఛానళ్లలో ఉద్యమానికి వ్యతిరేక వార్తలను ప్రభుత్వం రాయిస్తోందని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, తమ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని అన్నారు. కేవలం తనను దూషించడానికే కొందరు పెద్దల్ని చేరదీశారని, కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక కులాన్ని అదే కులస్తులతో తిట్టించడం ఎక్కడైనా చూశామా? అని ముద్రగడ ప్రశ్నించారు. ఉద్యమంలో కాపులు అలసిపోతున్నారని అన్నారు. ఏది ఏమైనా సరే ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

More Telugu News