: హైదరాబాద్‌లో వ్యాపారిని తుపాకీతో బెదిరించిన దుండగులు

హైదరాబాద్‌లో ఓ వ్యాపారిని ప‌లువురు దుండ‌గులు తుపాకీతో బెదిరించ‌డం క‌ల‌క‌లం రేపింది. అమీర్‌పేట్ ఆర్‌ఎస్ బ్రదర్స్ సమీపంలో జరిగిన ఈ ఘ‌ట‌న‌పై వ్యాపారి నుంచి పంజాగుట్ట‌ పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. ఆ వివ‌రాలు చూస్తే... కిశోర్‌కుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఈ రోజు మధ్యాహ్నం దుండ‌గులు తుపాకీతో బెదిరించడంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన స‌ద‌రు వ్యాపారి అక్కడి నుంచి పరుగులు తీసి, పోలీసుల‌ని ఆశ్ర‌యించాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

More Telugu News