: ముద్రగడ దీక్ష సాయంత్రంలోగా ముగియొచ్చు: టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు

కాపులకు రిజర్వేషన్లే ప్రధాన డిమాండ్ గా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేటి సాయంత్రంలోగా తన దీక్షను విరమించనున్నారట. ఈ మేరకు ప్రభుత్వం తరఫున నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ముద్రగడతో ప్రత్యేకంగా భేటీ అయిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు పేర్కొన్నారు. దీక్షకు ముందుగానే టీడీపీ నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బోండా ఉమామహేశ్వరరావులతో కలిసి బొడ్డు... ముద్రగడతో చర్చలు జరిపారు. తాజాగా నిన్న రాత్రి కూడా భాస్కరరామారావు ఒక్కరే ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ ప్రస్తావించిన అంశాలను చంద్రబాబు ముందుంచేందుకు నిన్న రాత్రే ఆయన విశాఖకు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నారు. విశాఖకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన బొడ్డు... నేటి సాయంత్రంలోగా ముద్రగడ దీక్ష విరమించే అవకాశాలున్నాయని చెప్పారు.

More Telugu News